జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి పడి శ్రీపతి రఘుపతి (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన రఘుపతి గ్రామ శివారులో తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య తిరుపతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : రెండంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు మృతి
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు