నాగర్ కర్నూల్ : జిల్లా పరిధిలోని మంతటి గ్రామానికి చెందిన ఎర్రమోని శివ శంకర్ కు గడ్డంపల్లికి చెందిన స్వప్నతో కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మల్లికార్జున్ (5) ప్రణయ్ (3) ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా గత మూడు నెలల క్రితం భార్య అలివేల పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా శివ శంకర్ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు కుమారుల చేతి మణికట్లను కత్తితో కోసాడు. ప్రాణం పోలేదని పెద్ద కుమారుడు మల్లికార్జున్ ను పీక పిసికి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన తల్లిదండ్రులు పుల్లయ్య, అలివేల కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే నానమ్మ అలివేల వెళ్లి చూసేసరికి ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు. చిన్న కుమారుడు ప్రణయ్ కళ్ళు తెరవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎర్ర మౌని శివ శంకర్ ను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.