బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి నుంచి యెడియూరప్ప డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా యెడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కరోనా పరిస్థితులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నెల 16న యెడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డ విషయం విదితమే. గతేడాది ఆగస్టులో మొదటిసారి కర్ణాటక సీఎం కరోనాకు గురయ్యారు. అప్పుడు యెడియూరప్పతో పాటు ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.