హైదరాబాద్ : సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. ఫతేనగర్లో సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వేముల వెంకటేశ్(47) దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశ్ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఘటనాస్థలిలో సనత్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.