హయత్నగర్ : నియోజకవర్గం పరిధిలోని హయత్నగర్ డివిజన్ సౌత్ కాలనీల్లో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కార మవుతుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బుధవారం డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల్లో రూ.కోటి 28 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.58 లక్షలతో నర్సింహారావునగర్ వద్ద నిలిచిపోయిన ఎస్డబ్ల్యుడి వరద కాలువను, రూ.15 లక్షలతో హయత్నగర్ నుండి ఫైర్స్టేషన్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ మధ్య నుండి పద్మాతి కాలనీ ఎస్డబ్ల్యుడి వరద కాలువకు లైన్కు లింక్ను, రూ.55 లక్షలతో బంజారా కాలనీ స్లాబ్ కల్వర్టు వద్ద నుండి అంబేద్కర్ కాలనీ వరకు ట్రంక్ లైన్ను చేపట్టనున్నారని వివరించారు. దీంతో హయత్నగర్ డివిజన్ పరిధిలోని సౌత్ కాలనీల్లో డ్రైనేజీ ప్రధాన సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు.
దశల వారీగా ఆయా కాలనీల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరి, తోగూట లీల, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.