నిజామాబాద్ : జిల్లా పరిధిలోని ఎడపల్లి మండలం జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే రహదారిలోఉన్న నిజాంసాగర్ మెయిన్ కెనాల్లో పసికందు మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. తక్షణమే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పసిపాపకు బొడ్డు దారం కూడా అలానే ఉంది. తలకు తీవ్ర గాయమైంది. శిశువు మృతదేహాన్ని ఎడపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.