మట్టెవాడ : వరంగల్ నగరంలోని పాపయ్యపేటకు చెందిన జన్ను కరుణాకర్(46) ఉరివేసుకుని మృతి చెందినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కూలి పని చేసుకుంటాడని, ఆయన ఆరోగ్యం భాగలేక పోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఆయన భార్య ఏలీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
రాజరాజేశ్వరీ ఆలయంలో చోరి
వరంగల్ ఎంజిఎం సమీపంలోని శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో చోరీ జరిగినట్లు మట్టెవాడి ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. గుర్తుతెలియన వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్ళినట్లు ఆయన తెలిపారు. అందులో సుమారు రూ. 5-10వేలు ఉంటాయన్నారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గణేష్ తెలిపారు.