ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు ఇన్నర్ రింగ్రోడ్డులోని నెక్సా షోరూం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వసంత్కుమార్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రెండుగంటల సమయంలో మరణించాడు. ఈ మేరకు చైతన్యపురి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.