బండ్లగూడ : మద్యానికి బానిసైన వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిషన్జీ తెలిపిన వివరాల ప్రకారం శ్యామల నగర్ శివరాంపల్లిలో నివాసం ఉండే సంతోష్ వెంకట్రావు (49) వాణిశ్రీరావు దంపతులు. వీరికి ఒక కూతురు ఉంది. మద్యానికి బానిసైన సంతోష్ ఇంటివద్దనే ఉంటూ డబ్బుల కోసం భార్యను వేదించేవాడు. దీంతో గత కొంత కాలంగా భార్య వాణిశ్రీ అతని నుంచి దూరంగా ఉంటుంది.
ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా సంతోష్రావు మరణించి శరీరం మొత్తం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో భార్య వాణిశ్రీ కి సమాచారం అందించి మృత దేహన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.