మహబూబాబాద్ : కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడంతో మారమూల ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్య సేవల్లో ఇబ్బంది రాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మహిళలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కొవిడ్ పరిస్థితులపై సమీక్షించారు.
ఈ రెండు, మూడు రోజుల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించి మారుమూల ప్రాంతాల్లోని హాస్పిటళ్లను సందర్శిస్తానని మంత్రి తెలిపారు. ములుగులోని ఏటూరు నాగారం ఏజెన్సీలో గల గిరిజనులకు మంచి వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా కొవిడ్ రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మహిళలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసరం ఉన్నా తనను వెంటనే సంప్రదించాలని, తన దృష్టికి సమస్య తీసుకొస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని కలెక్టర్లకు చెప్పారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి