జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవసాయ క్షేత్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే..స్టేషన్ ఘన్పూర్ మండలం దేశాయితండా వద్ద గల ఎమ్మెల్యే రాజయ్య వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదావశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారుగా 300 నుంచి 400 వరకు టేకు చెట్లు అగ్ని కీలలకు కాలి బూడిదయ్యాయి.
అగ్నిమాపక ఇంజన్స్ రావడం ఆలస్యం కావడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఎమ్మెల్యే అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
గన్తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి