కంది : పొలం పనులకు వెళ్లిన ఓ రైతు అక్కడే ఉన్న కరెంట్ తీగ తగలడంతో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరపల్లి గ్రామానికి చెందిన అంబయ్య గౌడ్ (55) ఈరోజు తెల్లవారుజామున తన పంట పొలంలో పనిచేస్తుండగా పొలంలో కిందకి జారి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన అంబయ్య గౌడ్ ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయ్యారు.