అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 69 మంది మృత్యువాతపడ్డారు. 4,304 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 89,732గా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,680 కరోనా కేసులు నమోదవ్వగా చిత్తూరులో 1,628, గుంటూరు-1,576, నెల్లూరు-1,258, కర్నూలు-1,158, అనంతపురం-1,095, విశాఖపట్నం-1,051, తూర్పుగోదావరి-952, విజయనగరం-692, కృష్ణా-641, ప్రకాశం-353, పశ్చిమ గోదావరి-331, కడపలో 219 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కొవిడ్-19 మరణాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణాలో 12, నెల్లూరులో 7, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడపలో ఐదుగురు చొప్పున, చిత్తూరు, గుంటూరులో నలుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.