హైదరాబాద్ : నగరంలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఇంజిన్ బౌలి సమీపంలో దుండగులు అడ్డగించి గొంతుకోసి దారుణంగా హతమార్చారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పాతకక్షలే హత్యకు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు. సమీపంలోని సీసీకెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.