సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, ఏప్రిల్ 26: నిత్యం ప్రజల మధ్య ఉండే టీఆర్ఎస్ నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని టీఆర్ఎస్ అభ్యర్థులు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయా వార్డుల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. నేటితో ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. ఈ మేరకు 22వ వార్డు అభ్యర్థి ఎడ్ల సోమిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా మంత్రి హరీశ్రావు సహకారంతో తక్షణమే పరిష్కరించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా అన్నారు. 1వ వార్డు అభ్యర్థి రెడ్డి విజేందర్రెడ్డి లింగారెడ్డిపల్లిలో ఇంటింటా ప్రచారం చేశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలని కోరారు. 2వ వార్డు అభ్యర్థి నాయిని చంద్రం, 15వ వార్డు అభ్యర్థి పాతూరి సులోచన శ్రీనివాస్రెడ్డి వార్డులో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. భవిష్యత్లో వార్డుకు సంబంధింనా ఏ సమస్య అయినా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 36వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చందిరెడ్డి రూపా రాజశేఖర్రెడ్డి ఇంటింటా తిరుగతూ ఓట్లు అభ్యర్థించారు.