చౌటుప్పల్, మార్చి 12: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం గాంధీ నగర్ తండాలోని ఓ ఫామ్హౌస్లో గురువారం రాత్రి నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పాల్గొన్న 90 మంది విద్యార్థులతోపాటు ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేసి, గంజాయి, ఎల్ఎస్డీ, లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. గ్రేటర్ హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెం దిన బీటెక్ విద్యార్థి జక్కడి శ్రీకర్రెడ్డి, ఏఎస్రావు నగర్కు చెందిన వ్యాపారి గిరీశ్ దడ్వాయి, వనస్థలిపురానికి చెందిన వ్యాపారి చొల్లేటి శరత్చంద్ర, ఈసీఐఎల్కు చెందిన డిప్లొమా విద్యార్థి షేక్ ఉమర్ఫారూక్లు స్నేహితులు. వీరంతా బృందంగా ఏర్పడి రేవ్ పార్టీకి ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను జక్కడి శ్రీకర్రెడ్డి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలోని తన తండ్రికి చెందిన ఫామ్హౌస్ను ఎంచుకున్నారు. అద్దె కడతామని తండ్రిని ఒప్పించాడు. ఎవరికి అనుమానం రాకుండా మహాశివరాత్రి రోజున రేవ్ నిర్వహిస్తుండగా విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ, సంస్థాన్ నారాయణపురం పోలీసులు దాడి చేశారు. ఏడుగురు నిర్వాహకులతోపాటు 90 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరినుంచి 400 గ్రాముల గం జాయి, 3 గ్రాముల ఎల్ఎస్డీ, 120 లిక్కర్ బాటిళ్లు, 3 ల్యాప్టాప్లు, 2 కెమెరాలు, 76 మొబైల్ ఫోన్లు, 15 కార్లు, 30 బైకులు, జెనరేటర్ వాహనం, 3 డీజే మ్యూజిక్ బాక్సులు, 21 ఎంట్రీ టికెట్లు, రూ.27 వేల నగదు, సిగరెట్ ప్యాకెట్లు, ఓసీఎం పేపర్లు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.