బెంగళూరు: 3000కుపైగా మొబైల్ సిమ్ కార్డులున్న 109 బాక్సులను కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సిమ్ బాక్స్ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 3,000కుపైగా సిమ్ కార్డులు కలిగిన 109 సిమ్ బాక్సులను వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపీ (క్రైమ్) సందీప్ పాటిల్ తెలిపారు. వీటికి సంబంధించి 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.