Crime
- Jan 01, 2021 , 15:36:49
8 వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

లక్నో: దట్టమైన పొగ మంచు వల్ల ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు జరిగాయి. దట్టమైన పొగ మంచు వల్ల ముందు ఉన్నవి, ఎదురుగా వచ్చేవి సరిగా కనిపించకపోవడంతో ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదాలు జరిగిన ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిని సైఫాయిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా కొత్త సంవత్సరం ఆరంభం రోజున రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. మరోవైపు శీతాకాలంలో పొగ మంచు వల్ల రోడ్లపై వచ్చే పోయే వాహనాలు సరిగా కనిపించవని, ఈ నేపథ్యంలో తెల్లవారుజామున వాహనాలు నడపవద్దని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల సూచనలు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు
- టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బైడెన్ ప్రమాణస్వీకారంలో ప్రత్యేక ఆకర్శణగా లేడీ గాగా, లోపెజ్
- బీహార్లో నేరాలు ఎందుకు పెరిగాయి?
MOST READ
TRENDING