వికారాబాద్ : పరిగి మండలం ఖుదావాన్పూర్లో దారుణం జరిగింది. పింఛను డబ్బుల కోసం తల్లిని చంపాడు తనయుడు. తల్లి భీమమ్మ(62) గొంతును విద్యుత్ తీగతో నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బలవంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.