రాంనగర్, మే 8 : క్రైం పార్టీ పోలీసులు నేరాలను ఛేదించడాన్ని చాలెంజ్గా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ చంద్రమోన్ సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో క్రైం పార్టీ పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో కృషిచేస్తే ఎలాంటి కేసునైనా ఛేదించవచ్చన్నారు. ప్రస్తుత ఎండకాలంలో దొంగతనా లు జరిగేందుకు ఆసారం ఉంటుందని, క్రైం పార్టీ పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఇతర జిల్లాలకు చెందిన నేరాలు, నేరస్తులు పట్టుబడే విధానాలను పరిశీలించాలని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సైబర్ ల్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుటా, మటా, పేకాట, వ్యభిచారం, నకిలీ విత్తనాలపై సమాచారం సేకరించాలని తెలిపారు. సమాచార వ్యవస్థను పెంపొందించుకోవడం ద్వారా నేరస్తుల కదలికలను పసిగట్టవచ్చని పేరొన్నారు. ప్రతి కేసును ఛేదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నిర్దేశించారు. విధి నిర్వహణలో సంతృప్తి చెందేలా సేవలందించాలని తెలిపారు. రివార్డులు, ఆవార్డుల ప్రకటనలో క్రైం బృందాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నేరస్థలంలో సాక్ష్యాధారాలు చెదరకుండా తీసుకు నే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నేరస్థలంలో సాక్ష్యాధారాలు చెదిరిపోయినట్లయితే జరిగే నష్టాలను వివరించాలని తెలిపారు. రేయింబవళ్లు గస్తీని ముమ్మరం చేయనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.