కొత్తగూడ : కొత్తగూడ మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట నుంచి కొత్తగూడ మీదుగా ఇల్లందు వెళ్లే మార్గంలో మహరాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు 50కిలోల గంజాయిని ద్విచక్రవాహనంపై తరలిస్తున్నారు. వాగు వద్ద పోలీసులు పహారా ఉండడంతో పోలీసులను చూసి గంజాయి స్మగర్లు పారిపోవడానికి ప్రయత్నించారు.
వారిపై అనుమానం వచ్చిన పోలీసులు చాకచక్యంగా పట్టుకుని బ్యాగ్లను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. నిందితుడిలో ఒకరు పరారీ కాగా మరోకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 50 కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.