హైదరాబాద్ : కరుడుగట్టిన రౌడీషీటర్ ముస్తాక్(35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాదర్ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 17న అర్ధరాత్రి ముస్తాక్పై కత్తులతో దాడి చేసి, రాళ్లతో మోది అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో అన్నదమ్ములైన మహమూద్, అయూబ్తో పాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను మీడియా ముందు సోమవారం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఆధిపత్యం కోసమే ముస్తాక్ను హత్య చేశారని సీపీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారికి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. గత 6 నెలల్లో 21 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ తెలిపారు.
టోలీచౌకీకి చెందిన ముస్తాక్ కరుడుగట్టిన రౌడీషీటర్. పాత మలక్పేట వాహెద్నగర్ ప్రాంతవాసియైన ముస్తాక్ కొద్ది నెలల క్రితం నుంచి టోలీచౌకీలో ఉంటున్నాడు. కాగా, పాత మలక్పేటలో సొంత ఇళ్లు ఉండటంతో తరచూ ఇక్కడకి వస్తుండేవాడు. ముస్తాక్ శుక్రవారం మలక్పేటకు చేరుకుని అబుబాకర్ మసీద్ వద్ద ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులైన రౌడీ షీటర్లు అయూబ్ బిన్ అలీ, మహమూద్లు మరో నలుగురితో కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో అయూబ్, మహమూద్లు మిగతా నలుగురు ముస్తాక్ను కత్తులతో పొడిచి, రాళ్లతో దాడి చేశారు. దీంతో ముస్తాక్ తీవ్ర రక్త స్రావంతో అక్కడిక్కడే మృతి చెందాడు.