భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలో తరచూ గంజాయి పట్టుబడుతుండడంతో ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 214 కేజీల గంజాయి పట్టుబడింది. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏఎస్పీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో పట్టణ ఎస్సై మధుప్రసాద్ అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో (AP16BG 7777) అనే నెంబర్ గల స్కోడా కారు, (AP 28 AW 4469) నెంబర్ గల వెర్నా కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో భారీగా గంజాయి పట్టుబడింది. 214 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ. 42.80 లక్షలు ఉంటుందని తెలిపారు. కారుల్లో ఉన్న ఐదుగురు నిందితులు సర్ధార్రాథోడ్, అంజిత్, నాగ సుందర్, ఉమేష్, కామరాజు మునియప్పను అదుపులోకి తీసుకొని విచారించినట్లు చెప్పారు.
వీరిలో కొంతమంది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా, మరి కొంతమంది కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు ఉన్నారన్నారు. వీరు గంజాయిని దారకొండ, సీలేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరుకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్సై మధుప్రసాద్, శిక్షణ ఎస్సై రంజిత్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జులుం
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం