జగిత్యాల : జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్ గురువారం కరోనాతో మృతి చెందారు. మండలంలోని చల్గల్ గ్రామానికి చెందిన గంగారాం గౌడ్ (52)కు వారం క్రితం కరోనా బారిన పడ్డారు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో చేరారు. గురువారం పరిస్థితి విషమించి మృతి చెందారు. ఎంపీపీ మృతి పట్ల రాష్ర్ట ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీపీకి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
హత్యకేసు నిందితుడికి జీవిత ఖైదు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం