Crime
- Dec 03, 2020 , 11:07:42
బెలూన్ను మింగిన బాలుడు మృతి

ముంబై : ఓ నాలుగేళ్ల బాలుడు బెలూన్స్తో ఆడుకుంటూ ఒకదాన్ని మింగేశాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ర్ట రాజధాని ముంబైలోని అంధేరిలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. దేవరాజు అనే బాలుడు తన సోదరితో కలిసి బెలూన్స్ ఊదారు. ఈ క్రమంలో దేవరాజు ఓ బెలూన్ను మింగేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బెలూన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో బాధిత బాలుడిని అంధేరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి.. నానావతి ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే బాలుడు కన్నుమూశాడు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. అతని గొంతులో నుంచి బెలూన్ను బయటకు తీశారు.
తాజావార్తలు
- టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
MOST READ
TRENDING