హైదరాబాద్ : రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నగరంలోని బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అక్రమంగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నిఘాపెట్టిన పోలీసులు మధ్యాహ్నం కరోనా బాధిత కుటుంబానికి ఇంజక్షన్లు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 18 రెమిడెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.