రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని ఒక కరోనా ఆసుపత్రిలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. రాయ్పూర్లోని రాజధాని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని ఇతర వార్డులకు వ్యాపించాయని చెప్పారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి కరోనా రోగులను ఖాళీ చేయించినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు కూడా కరోనా రోగులని ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. ఒక కరోనా రోగి సజీవ దహనం కాగా మరో నలుగురు పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించకపోవడం, ఆసుపత్రి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం భూపేశ్ భాగేల్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.