పరకాల/దామెర, ఏప్రిల్ 9 : ముస్లిం, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మసీదుల అభివృద్ధికి నిధు లు కేటాయించినందుకు శుక్రవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో చల్లా ధర్మారెడ్డిని పలువురు ముస్లింలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణంలోని షాదీఖాన నిర్మాణానికి రూ.50లక్షలు, దామెర మండలంలోని మసీదులు, చర్చిల అభివృద్ధికి రూ.30లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.కోటిన్నరతో నియోజకవర్గంలోని మసీదులు, ఖబ్రస్థాన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రూరల్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, దామెర ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పనా కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోలం కృపాకర్రెడ్డి, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాస్, శ్రావణ్య అనిల్, సాంబయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు అక్తర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్, మాజీ ఎంపీటీసీ రమేశ్, వేల్పుల ప్రసాద్, ఉస్మాన్, రవీందర్, ప్రవీణ్, మహబూబ్ అలీ, ఖైరత్ కమాలుద్దీన్, షరీఫ్, అన్వర్, తాజొద్దీన్, అక్బర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మిసెస్ శ్రీలంక వరల్డ్ అరెస్టు