పెద్దపల్లి : జిల్లా పరిధిలోని మానేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద మానేరు వాగులోకి కుటుంబ సభ్యులైన 8 మంది స్నానాలకు వెళ్లారు. వీరంతా స్నానాలు చేస్తుండగా వాగులో గల్లంతు అయ్యారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు అప్రమత్తమై ఐదుగురిని ప్రాణాలతో కాపాడారు. గల్లంతైన వారిని జోగుల మనోజ్(30), పెంట రాహుల్(20), జోగుల ఆశిష్(10)గా గుర్తించారు. ఈ ముగ్గురి మృతదేహాలను బయటకు వెలికితీశారు. బాధితులందరూ వేములవాడకు చెందిన వారని పోలీసులు తెలిపారు.