హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద హోండా సిటీ కారు బీభత్సం సృష్టించింది. చెక్పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పటికీ కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెక్పోస్ట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, యువకుల ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..