మిత్రాశర్మ కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. గీతానంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘పాతికేళ్లకు నాలుగు తక్కువ మచ్చా..పాత కలలకు సెండాఫ్ ఇచ్చేయ్ చిచ్చా..రాజా హే రాజా’ అనే గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. స్మరణ్ సంగీతాన్ని అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యువతరం మనోభావాలకు దర్పణంలా ఉండే చిత్రమిది. మూడు జంటల కథతో కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ప్రేమ, వినోదం, ఎమోషన్స్ కలబోతగా అందరిని అలరిస్తుంది’ అని అన్నారు. రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.