సికింద్రాబాద్, జూలై 6: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని సుభాష్చంద్రబోస్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు కేటాయింపు ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. ఆర్డీవో వసంత కుమారి, ముషీరాబాద్ తాసీల్దార్ జానకి, హౌసింగ్ ఈఈ వెంకట దాస్రెడ్డి, కార్పొరేటర్, లబ్ధిదారుల సమక్షంలో డ్రా తీసి ఇండ్ల మంజూరు పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఈనెల 8న సుభాష్చంద్రబోస్నగర్, దోభీఘాట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో ఖాళీ స్థలాల కొరత కారణంగా ఇతర ప్రాంతాల్లో ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రామేశ్వర్గౌడ్, కరాటేరాజు తదితరులు పాల్గొన్నారు.