Crime
- Oct 09, 2020 , 17:04:48
మంత్రాలతో కరోనా దూరం..అరెస్ట్ చేసిన పోలీసులు

సిరిసిల్ల క్రైం : జిల్లా పోలీసులు దూకుడు పెంచుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. తాజాగా మంత్రాల నెపంతో కరోనా వైరస్ ని పారదోలుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణానికి చెందిన కంచర్ల కనకయ్య అనే వ్యక్తి తాయత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.
పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు జిల్లా ప్రజలే కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చే వారిని కూడా మంత్రాలు, తాయత్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి ధనార్జనకు పాల్పడుతున్నాడని సీఐ రవికుమార్ తెలిపారు. అతని దగ్గరి నుంచి ఉంగరాలు, రంగు రాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని చెప్పారు.
తాజావార్తలు
- మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు
- చిన్నారులవా.. కోతులవా..?
- ప్రారంభ తేదీని ప్రకటిస్తాం
- వారియర్స్కు వ్యాక్సినేషన్
- యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
- ప్రతి గ్రామంలో బస్షెల్టర్ : ఎమ్మెల్యే చిరుమర్తి
- సైకోను పట్టించిన సీసీ కెమెరా
- సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం
- వైద్య సిబ్బందికి మొదటి టీకా సంతోషకరం
- చిన్ని మెదడుకు పెద్ద కష్టం
MOST READ
TRENDING