నిద్రలోనే యువకుడి మృతి
తల్లిదండ్రులకు గాయాలు
మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదం
బెల్లంపల్లి టౌన్, ఏప్రిల్ 4 : కారు అదుపుతప్పి ఇంటి వరం డాలోకి దూసుకెళ్లగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పట్టణంలోని సుభాష్నగర్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. టూటౌన్ ఎస్ఐ భాస్కర్రావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుభాష్నగర్కు చెందిన బరిగెల లింగయ్య, రాజవ్వ దంపతులు తన కు మారుడు మధు(20)తో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి ముగ్గు రు కలిసి వరండాలో నిద్రించారు. ఇైంక్లెన్ బస్తీకి చెందిన ముంచెర్ల రాకేశ్ మద్యం తాగి తన కారులో ఇైంక్లెన్ బస్తీ నుంచి శాంతిఖని వరకు అటు.. ఇటూ మూడుసార్లు తిరి గాడు. శాంతిఖని నుంచి ఇైంక్లెన్ వైపు వస్తుండగా సుభాష్ నగర్ వద్ద అదు పుతప్పి కారు లింగయ్య ఇంటి వరండా లోకి దూసుకెళ్లింది. మంచంలో పడుకున్న మధును కారు ఢీకొనగా ఎగిరి కింద పడ్డాడు. తర్వాతి మంచంలో నిద్రి స్తున్న లింగయ్య, రాజ వ్వలనూ ఢీకొట్టడంతో గోడలో ఇరు క్కుపోయారు. మద్యం మత్తులో ఉన్న రాకేశ్ కంగారులో కారును అటు ఇటూ తి ప్పడంతో టైర్ల మధ్య మధు నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో టూటౌన్ ఎస్ఐ భాస్కర్రావు అక్కడికి చేరుకుని తల, చేతికి తీవ్ర గాయాలైన రాజవ్వ, లింగయ్యను బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకి తరలించి వైద్యం చేయించారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ భాస్కర్ తెలిపారు.
రైలు ఢీకొని సింగరేణి కార్మికుడు..
మందమర్రి రూరల్, ఏప్రిల్ 4 : రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని సింగరేణి కార్మికుడు నీరటి స్వామి (46) మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున స్టేషన్ ఆవరణలోని మూడో ట్రాక్ మధ్యలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. స్వామి ప్రతి రోజూ రైల్వే ట్రాక్ పక్కనున్న పార్కులోకి వాకింగ్కు వెళ్తుంటాడు. ఆదివారం కూడా వాకింగ్ వెళ్లేందుకు ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామి ఆర్కేపీలోని విద్యానగర్లో నివాసముండగా, శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో విధులు నిర్వహించేవా డు. ఆయనకు భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు మంచిర్యాల రైల్వే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపత్ తెలిపారు.
బైక్ అదుపు తప్పి యువకుడు ..
కన్నెపల్లి, ఏప్రిల్ 4 : బైక్పై నుంచి పడి మండలంలోని టేకులపల్లికి చెందిన శీలం తిరుపతి(39) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి బైక్పై తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ నుంచి టేకులపల్లి వైపు వెళ్తున్నాడు. భీమిని మండలం రాంపూర్ ప్రాజెక్టు సమీపంలో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న భీమిని ఎస్ఐ కొమురయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బెల్లంపల్లి సర్కారు దవాఖానకు తరలించారు. కాగా తిరుపతికి ఇంకా వివాహం కాలేదని, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రెండు ఆటోలు ఢీకొని ఒకరు..
జైనూర్, ఏప్రిల్ 4: రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనగా ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఉ ట్నూర్ ఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొలాస గ్రామానికి చెందిన హనీఫ్ఖాన్ (70), రాంకిషన్, ఇస్మాయిల్ఖాన్, రాజు, సయ్యద్ ఇబ్ర హీం శనివారం రాత్రి ఆదిలాబాద్లో ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. తిరిగి ఆటోలో జైనూర్కు వస్తున్నారు. పవర్గూడ గ్రామానికి చెందిన మరో ఆటో జైనూర్ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్నది. ఉట్నూర్ మండలం ఏందా గ్రామం మలుపు వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో హనీఫ్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇస్మాయిల్ఖా న్, రాజు మొటె, సయ్యద్ షబ్బీర్, ఇబ్రహీం గాయపడ్డారు. ఇబ్రహీం పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. మృతుడికి ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. హనీఫ్ఖాన్ బంధువు యూనిస్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చూడండి..
మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో 57 వేలకుపైగా కరోనా కేసులు.. ముంబైలో 11వేల మందికి పాజిటివ్
ప్రజాసేవ కోసం.. సినిమాలు వదిలేస్తా: కమల్ హాసన్