Crime
- Dec 05, 2020 , 14:25:24
200 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

సూర్యాపేట : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేటలో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుండి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు. మద్దిరాల మండలం తూర్పుగూడ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జిల్లా టాస్క్ఫోర్స్, మద్దిరాల పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో గంజాయిని తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ఆన్లైన్ క్లాస్లో టీచర్ను బురుడీ కొట్టించిన స్టూడెంట్
- ఆచార్యకు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
- హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్న్యూస్
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
MOST READ
TRENDING