కరోనా దెబ్బకు వేలాది మంది ఉపాధి కోల్పోయారు.. దీంతో చాలా మంది ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా.. డబ్బు కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిని సైబర్నేరగాళ్లు అవకాశంగా తీసుకున్నారు.. ఉద్యోగాలులేక.. కష్టాల్లో ఉన్నవారికి వల వేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా, బల్క్ ఎస్ఎంఎస్లతో ఉద్యోగ ప్రకటనలు పెట్టి..ఆకర్షిస్తున్నారు.. ఆ ప్రటనలు చూసి..వారిని సంప్రదించేవారికి మాటలతో మంచి ఉద్యోగాలు, ఎక్కువ జీతం అంటూ నమ్మిస్తారు.. ఇందుకు మీ వద్ద స్మార్ట్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది.. ఇవి ఉంటే ఇంటి వద్దనే ఉండి రోజుకు రూ.300 నుంచి రూ.3000 వరకు సంపాదించవచ్చు.. ఇలా సంపాదించి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.. నెలకు రూ.9 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించుకుని ప్రశాంతంగా ఉండండంటూ తమ వలలో చిక్కేలా మాటలతో మాయ చేస్తారు.. ఆ తర్వాత ఎవరైనా వారి వలకు చిక్కగానే.. కొన్ని వివరాలు సేకరిస్తారు.. మీకు పని అప్పగించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలని సూచిస్తారు… ఆ తర్వాత వర్క్ కోసం రూ.30 వేలు డిపాజిట్ చేయాలి.. ఈ డిపాజిట్ తిరిగి మీకు ఇచ్చేస్తామని నమ్మించి.. మోసాలకు పాల్పడుతున్నారు.
దీంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నవారు వెంటనే ఈ ప్రకటనలకు బోల్తాపడి.. వారు చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని.. పని అప్పగించడానికి కూడా డబ్బులు కట్టేస్తున్నారు. ఆ తర్వాత పని కోసం ఎదురుచూస్తూ ఉంటారు.. ఎంతకీ పని రాకపోవడంతో ఆ ప్రకటనలోని నంబర్కు ఫోన్ చేయగా.. స్విచాఫ్ అని సమాధానం వస్తున్నది. ఆ తర్వాత మోసపోయామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా చాలా మంది మధ్యతరగతివారు కరోనాతో నెలకొన్న పరిస్థితులు కష్టాలు తీరిపోతాయని భావించి.. ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. నెలకు ఎంతో కొంత డబ్బు వస్తుందనే ఆలోచనతో అప్పులు తెచ్చి మరి సైబర్ మోసగాళ్లకు డబ్బులు చెల్లించి.. మరిన్ని కష్టాలు కొని తెచ్చకుంటున్నారు.