అగర్తలా: సహోద్యోగి కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈ ఘటన జరిగింది. సెఫజలా జిల్లా కోనాబన్లోని మధుపూర్లో ఉన్న ఓఎన్జీసీ జీసీఎస్లో శనివారం ఉదయం ఒక జవాన్ సహచర జవాన్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో త్రిపుర రాష్ట్ర రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. చనిపోయిన ఇద్దరు జవాన్లు త్రిపుర రాష్ట్ర రైఫిల్స్లోని 5వ బెటాలియన్కు చెందినవారని త్రిపుర పోలీస్ శాఖ తెలిపింది. కాల్పుల అనంతరం నిందితుడు జవాన్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని పేర్కొంది. మరోవైపు ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఈ కాల్పుల ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.