మంగళూర్: బంగారం స్మగ్లర్లు రోజురోజుకు బరితెగిస్తున్నారు. ఎంతమంది పట్టుబడ్డగా కొత్తగా బంగారం స్మగ్లర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు విమనాశ్రయంలో వేర్వేరుగా ముగ్గురు బంగారం స్మగ్లర్లు పట్టుబడ్డారు. దాంతో కస్టమ్స్ అధికారులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా బూట్లలో బంగారం పెట్టుకుని దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేశారు. వారిదగ్గర అక్రమంగా తరలిస్తున్న రూ.26,43,840 విలువైన బంగారు గొలుసులు, చిన్నచిన్న బంగారం ముక్కలు పట్టుబడ్డాయి. దుబాయ్ నుంచే వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ.92,27,590 విలువైన బంగారం పట్టుబడింది. దాంతో అధికారులు నిందితులు ముగ్గురిని అరెస్ట్చేసి పోలీసులకు అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు రాష్ట్రపతి
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు