హదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా, ఇతర సమస్యలు దరిచేరకుండా కాపాడాలంటూ అమ్మవారిని ప్రార్థించే ఈ బోనాల పండుగ ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన నిబంధనలను పాటిస్తూ.. ఆరోగ్యభారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములమవుదామని ఆయన పిలుపునిచ్చారు.