రైతులు రుణాలను రెన్యువల్ చేసుకోవాలి
అదనపు కలెక్టర్ అంజయ్య
జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
కలెక్టరేట్, మార్చి 30: నిర్దేశించిన లక్ష్యాన్ని అన్ని బ్యాంకులు సకాలంలో సాధించాలని, రైతులంతా పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ అంజయ్య పేర్కొన్నారు. పొదుపు భవనంలో అన్ని బ్యాంకుల మేనేజర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కలిసి మంగళవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాం కులు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి నిర్దేశించిన 1,818.18 కోట్లకు గాను ఇప్పటి వరకు 1,230.72 కోట్ల రుణాలను మంజూరు చేశామని తెలిపారు. యాసంగి పంట రుణ లక్ష్యం 410.52 కోట్లు కాగా, ఫిబ్రవరి వరకు 221.52కోట్లు విడుదల చేశామన్నారు. జిల్లాలో ఎస్టీ కార్పొరేషన్ వార్షిక (2020-21) రుణ ప్రణాళికను విడుదల చేశారు. జిల్లాకు 52 యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు వంద శాతం కంటే ఎక్కువగా రుణాలను విడుదల చేశామన్నారు. రైతులు పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. లీడ్బ్యాంకు అధికారి రంగారెడ్డి, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, యూనియన్ బ్యాంకు అధికారి రాఘవులు మేనేజర్లు ఉన్నారు.