బెంగళూరు: స్కూల్కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని బంట్వాల్లో ఈ దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలిక శుక్రవారం స్కూల్కు వెళ్తున్నది. తెల్లని కారులో వచ్చిన ఐదుగురు ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దక్షిణ కన్నడ ఎస్పీ రిషికేష్ సోనావానే తెలిపారు. పరారిలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.