ముంబై : ఓ బాలిక పట్ల ఓ నలుగురు వ్యక్తులు క్రూర మృగాల్లా ప్రవర్తించారు. కామోద్దీపనాలు కలిగించే ఇంజెక్షన్లు, ట్యాబెట్లు ఇచ్చి 8 ఏండ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. ముంబైలోని అంధేరికి చెందిన ఓ యువతిని 8 ఏండ్ల క్రితం పొరుగింటి వారు కిడ్నాప్ చేశారు. అప్పుడు ఆమె ఇంటర్ చదువుతోంది. కిడ్నాప్ చేసిన తర్వాత ఆ బాలికకు కామోద్దీపనాలు కలిగించే ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఈ పాడు పనికి అతనికి భార్య కూడా సహకరించింది. దీంతో వారు పెట్టే హింస భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పారిపోయినా, బయటకు విషయం చెప్పినా, తమ వద్ద వీడియోలను బయటపెడుతామని బాలికను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలిక మరింత ఒత్తిడికి గురైంది.