గువాహతి: తాలిబన్లకు సోషల్ మీడియాలో మద్దతిచ్చిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. తాలిబన్లు 20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని స్వాగతిస్తూ, వారికి మద్దతిస్తూ అస్సాంకు చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్స హా పలు దేశాలు తాలిబన్లకు మద్దతు ఇవ్వకపోవడాన్ని మరి కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు.
కాగా, ఈ పోస్టులను అస్సాం సైబర్ సెల్ పోలీసులు సీరియస్గా పరిగణించారు. 11 జిల్లాలకు చెందిన 14 మందిని అరెస్ట్ చేశారు. హైలకందికి చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థి, తేజ్పూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న మరో ఇద్దరు కూడా అరెస్టైన వారిలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.