హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో నిన్న రాత్రి దారుణం జరిగింది. 13 ఏండ్ల వయసున్న ఓ బాలిక.. వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు తన బైక్పై ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఇవాళ ఉదయం ఆ కాంప్లెక్స్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తనకు జరిగిన ఘోర అవమానాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.