జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్ల స్వామి (51) అనే వ్యక్తి కల్లుగీత వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. కాగా, రోజువారీ లాగే కల్లు గీయడానికి వెళ్లాడు. తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా కాలుకి ఉన్న గుయ్యి జారిపోవడంతో తాటి చెట్టు పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రమణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు