జగిత్యాల: ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల పురపాలక సంఘం పరిధిలోని నూకపల్లి అర్బన్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. నూకపల్లిలో రూ.212 కోట్ల వ్యయంతో 4620 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇవాళ ఉదయం జగిత్యాలకు చేరుకున్న కవిత.. ఎమ్మెల్యేలు సంజయ్, సుంకె రవిశంకర్తో కలిసి ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ రవికి సూచించారు.