జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి హార్వెస్టర్ కింద పడి మృతి చెందిన విషాద సంఘటన మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మారపు శ్రీనివాస్ (48) ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కింద పడి మృతి చెందాడు.
గ్రామ శివారులో గల పల్లె కుంట వెనకాల ఉన్న తన పొలంలో హార్వెస్టర్ వరి కోస్తుండగా దాని ముందు పారా తీయడానికి వెళ్లాడు. అది గమనించని డ్రైవర్ బండారి అంజయ్య వరి కోత మిషన్ ని శ్రీనివాస్పై ఎక్కించాడు. ఒక్కసారిగా అరుపులు రావడంతో డ్రైవర్ దిగి చూడగా మిషన్లో గాయాలతో ఉన్న శ్రీనివాస్ ను బయటికి తీశారు.
చికిత్స నిమిత్తం హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు