చెన్నై : విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్య కామెంట్లు చేస్తూ వేధించిన చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ టీచర్ రాజగోపాలన్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజగోపాలన్ పై విద్యార్ధినులను అభ్యంతరకరంగా తాకడం, అమర్యాదకరంగా మాట్లాడటం వంటి చేష్టలతో పాటు విద్యార్థినులను వాట్సాప్ మెసేజ్ లతో వేధించడం వంటి ఆరోపణలున్నాయి.
నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విద్యార్ధినులను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని అంతకుముందు స్కూల్ యాజమాన్యం రాజగోపాలన్ పై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ స్పష్టం చేసింది.