మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలో ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలరాజు.. మహబూబ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చవుదుతున్నాడు. కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కళాశాల మూడో ఫ్లోర్లో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాగా, 15 రోజుల క్రితం బాలరాజు తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. మనస్తాపానికిగురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.