భోపాల్: మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. నిన్నరాత్రి మాండ్లా, బాలాఘాట్ పోలీసులు లాల్పూర్ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగిగాయని హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారన్నారు. వారిపై చెరో రూ.14 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. ఘటనా స్థలంలో మూడు తుపాకులు, వాకీటాకీ, ఇతర సామాగ్రి లభించాయని, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.