అగర్తలా : డ్రగ్స్ సరఫరా రాకెట్, దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలపై త్రిపురలోని సెపహిజలా జిల్లాలోఅరెస్టయిన వ్యక్తి పోలీస్ కస్టడీలో బుధవారం గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. సొనముర పోలీస్ స్టేషన్లోనే అతడిని చంపేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితుడు జమల్ హుసేన్ను అరెస్ట్ చేసిన సమయంలోనే ఆయన ఛాతీ నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారని తెలిపారు. 2009 దోపిడీ కేసు, డ్రగ్స్ సరఫరా కేసుల్లో నిందితుడైన జమాల్ హుస్సేన్ అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పారు.
ఇక నిందితుడు ఇంటి వద్దే ఉంటున్నాడని ఇటీవల సమాచారం రావడంతో అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించగా కస్టడీలో హింసించారనే ఆధారాలు లభించలేదని సెపహిజల ఎస్పీ కృష్ణేందు చక్రవర్తి పేర్కొన్నారు.